చౌటుప్పల్ :
పది సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేసారు
ఒక్క సంవత్సరానికి ఎందుకు ఇంతా రాద్దాంతం చేస్తున్నారు.
పేదలకు మంచి చేస్తుంటే ,ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే కేటీఆర్, హరీష్,కవిత జీర్ణించుకుంటలేరు.
10 సంవత్సరాలలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెస్తున్నాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేసిన అప్పులకు వడ్డీ లు కడుతూనే హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తాం
చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది.
నా రాజకీయ రంగ ప్రవేశమే చేనేత కార్మికుల సమస్యలతో ప్రారంభమైంది.
ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి నేతన్నలకు 350 కోట్ల రుణమాఫీ చేయించాను
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నేతన్న లకు రుణమాఫీ చేయిస్తా.
త్రిప్ట్ పథకాన్ని యధావిధిగా కొనసాగిస్తాం, సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తాం. అని ఆయన పేర్కొన్నారు.
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో రాజ్ గోపాల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన *ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల* కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . చేనేత సమస్యలపై పోరాటం తోటే నా రాజకీయ రంగ ప్రవేశం జరిగిందని, చేనేత అన్నలకు నాకు అవినాభావ సంబంధం ఉందన్నారు…తెలంగాణ ఉద్యమంలో అణగారిన వర్గాలు, పేదలు,నిరుద్యోగులు, రైతులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో స్వయంగా పాల్గొని కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని,తెలంగాణ ఒక పార్టీదో, ఒక కుటుంబంతో కాదని, ప్రజా ఉద్యమం ద్వార తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నామని గుర్తు చేసారు…
గత పది సంవత్సరాల కాలంలో చేనేత కార్మికులకు న్యాయం జరగలేదన్నారు..గత ప్రభుత్వాలు చేనేత కార్మికుల్ని చేనేత రంగాన్ని కేవలం ఓట్ల కోసం వాడుకున్నారే తప్పా నిజమైన ప్రేమ చూపించలేదన్నారు.గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు వారితో నేపించి చేతులు దులుపుకొందని,పదేళ్ల పాటు చేనేతక సంఘాలకు ఎన్నికలు కూడా నిర్వహించకుండా సంఘాలను నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వం అన్ని రంగాలను అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని, వాటి నుండి కోలుకోవడానికే ప్రభుత్వానికి సమయం పడుతుందని,గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే , కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులకు మిత్తి కడుతూ పథకాలను కొనసాగిస్తుందన్నారు..