నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 26:
ఎన్నో మోసపూరిత మాటలతో దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అచ్చే దిన్ ఆయేగా అని చెబుతూ దేశ సంపదను కార్పోరేట్ తొత్తులకు దోచి పెడుతూ ,
మతోన్మాద శక్తులను రెచ్చగొడుతూ, కులాలు, మతాల మధ్యన చిచ్చు పెడుతున్న బిజేపీ పార్టీకి దేశాన్ని పాలించే నైతిక హక్కు కోల్పోయిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు విజ్ఞు కృష్ణనన్ ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలకు నిరసనగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 17న హన్మకొండ నుండి ప్రారంభమైన సిపిఎం జన చైతన్య యాత్ర ఆదివారం నేరేడుచర్లకు చేరుకున్న సందర్భంగా ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలతో దేశ వ్యాప్తంగా 2014 నుండి 2022 వరకు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 880 రోజుల ఢిల్లీ చుట్ట పక్కల రైతులు చేసిన దీక్షల సమయంలో మోడీ మొండి వైఖరి కారణంగా 150 మంది రైతులు మృతి చెందారని అన్నారు. ఏప్రిల్ 5న ముద్దూర్ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో 550 రైతు సంఘాలు, 5 లక్షల మంది రైతన్నలతో ఢిల్లీలో బారీ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బిజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం కోసం జన చైతన్య యాత్రతో ప్రజల ముందుకు వచ్చామన్నారు.మోడీ పచ్చి రైతు వ్యతిరేకి అని, రైతులను వ్యవసాయానికి దూరం చేయడానికే నల్ల చట్టాలు తీసుకవచ్చారని దుయ్యబట్టారు. పెద్ద నోట్లు రద్దు చేస్తామని అంతకంటే పెద్ద నోటు 2 వేలు తెచ్చి నల్లధనం మరింత పెరిగేలా ఊతమిచ్చారన్నారు. కార్మిక చట్టాలను గౌరవించని ఈ మోడీకి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇయ్యలేని దుర్మార్గుడు మోడీ అన్నారు. 70 సంవత్సరాల కాలంలో దేశ ప్రజలు కూడ పెట్టిన ఆస్తులను అప్పనంగా, కారు చౌకగా అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించారు.బరితెగించి ప్రజలపై పన్నులు వేస్తున్న మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని హితవు పలికారు. బిజెపి ప్రభుత్వం రాగానే నల్లధనాన్ని ప్రతి ఖాతాకు 15 లక్షలకు తీసుకొస్తానని నమ్మబలికి ప్రజలందరినీ జన్ ధన్ ఖాతాలు తీసుకోమని చెప్పి నేటికి ఎనిమిది సంవత్సరాలు దాటుతున్న నయా పైసా వేయలేదు అన్నారు. సామాన్యుడిని మధ్యతరగతి వాడి నడ్డి విరిచేందుకు జీఎస్టీ రూపంలో టాక్స్లు వసూలు చేస్తూ గ్యాస్ పప్పు ఉప్పు పెట్రోల్ అన్ని ధరలను అన్ని వర్గాల ప్రజలకు భారమయ్యేలా చేసిన ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ని విమర్శించారు. ప్రజలకు ఇవేమీ అర్ధం కాకుండా చేయడానికి మతోన్మాదాన్ని, దేవున్ని ముందుకు తీసుకొస్తున్నారని అన్నారు. ఇన్ని పాపాలు చేసిన మోడీని, బీజేపీ పార్టీని దేశం నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీని కట్టడి చేయడం కోసం ప్రజలందరూ కలిసి రావాలని కోరారు. చైతన్య యాత్రలో కలిసి వచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్టేజి పైకి ఆహ్వానించినా పైకి వెళ్లకుండా సామాన్య కార్యకర్తలాగానే మండుటెండలో కూర్చున్న కార్యకర్తల తో కలిసి కూర్చోవడం విశేషం. సమావేశంలో జన చైతన్య యాత్ర ఇంచార్జీ పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొలిశెట్టి యాదగిరి, సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, నేరేడుచర్ల పాలక వీడు మండల కార్యదర్శులు సిరికొండ శ్రీను, కే అనంత ప్రకాష్ ,బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి చిత్తలూరి సైదులు, కుంకు తిరుపతయ్య, పాతూరి శ్రీనివాస్ రావు, మర్రినాగేశ్వరరావు, ఎడ్ల సైదులు, రాంమూర్తి, శ్రీను తదితరులు ఉన్నారు.