గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించబోయే ఏఐసీసీ సమావేశాలకు కాంగ్రెస్ అధిష్ఠానం ముసాయిదా కమిటీని నియమించింది. 15 మంది సీనియర్ నేతలతో కూడిన ఈ కమిటీలో.. సభ్యుడిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అధిష్ఠానం అవకాశం కల్పించింది. కమిటీకి కన్వీనర్గా రన్దీ్ప సింగ్ సూర్జేవాలా.. సభ్యులుగా జైరాం రమేశ్, తారీఖ్ అన్వర్, దీపా దాస్మున్షీ, భూపేశ్ భగల్, సచిన్ పైలట్, రజనీ పాటిల్, పీఎల్ పునియా, బీకే హరిప్రసాద్, గౌరవ్ గొగొయ్, మనీష్ తివారి, విజయ్, బెన్ని బెహనన్, విక్రాంత్ భురియా ఉన్నారు.