Sunday, May 18, 2025
HomeTelanganaకాంగ్రెస్ అభ్యర్థిత్వం పై ధీమా! హుజూర్నగర్ కాంగ్రెస్ టికెట్ పై ఎవరి ప్రయత్నాలు వారివే.

కాంగ్రెస్ అభ్యర్థిత్వం పై ధీమా! హుజూర్నగర్ కాంగ్రెస్ టికెట్ పై ఎవరి ప్రయత్నాలు వారివే.

హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 30:
హుజూర్నగర్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా ఈ దఫా గాంధీభవంలో అభ్యర్థిత్వం కోసం ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మాజీ టీపీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రస్తుత నల్లగొండ ఎంపీ నలమాధ ఉత్తంకుమార్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశాలతో నేనే కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో దిగుతున్నానని పలుమార్లు స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం నేపథ్యంలో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి అంటూ ఏకంగా ఆరుగురు అభ్యర్థులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన అభ్యర్థుల దరఖాస్తుల్లో వారు హుజూర్నగర్ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు
హుజూర్నగర్ నియోజకవర్గం లో స్థానికుడిగా సుపరిచితుడుగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నవాడిగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు వ్యక్తిగత పరిచయాలతో నియోజకవర్గ ప్రజల్లో నాకంటూ ఒక స్థానం ఉంది అవకాశం కల్పించాలని కోరుతూ మాజీ ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గం రెండు దరఖాస్తులు చేసుకున్న మరో వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు తొండపాడుకు చెందిన అన్నపురెడ్డి అప్పిరెడ్డి ఉన్నారు. గతంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీపడి ఉత్తం ఆశీస్సులతో ఉత్తంకి మద్దతు ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో చేరి ఉత్తం ప్రధాన అనుచరుడుగా ఉన్న అప్పిరెడ్డి కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో తనకు అవకాశం కల్పిస్తే గెలుస్తానన్న నమ్మకం ఉందని అది కూడా ఉత్తం పద్మావతిల ఆశీస్సులతోనే అది సాధ్యమని వారు పోటీ చేస్తే నా మద్దతు వారికి అని లేదంటే నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని స్పష్టం చేయడం జరిగింది.
మరో అభ్యర్థి ఎన్నారై వేపలసింగారంకు చెందిన సామల జయపాల్ రెడ్డి ఉత్తం అభిమానిగా తనకు హుజూర్నగర్ నియోజకవర్గం లో అవకాశం కల్పిస్తే పోటికి సిద్ధమంటూ దరఖాస్తు చేసుకున్నారు.
ఇక హుజూర్నగర్ నియోజకవర్గంలో బీసీల ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ గత మూడు పర్యాయాలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల గెలుస్తూ వస్తున్నారు . గతంలో కాసోజు శంకరమ్మ మంగళ స్వామి గౌడ్లు ఇతర పార్టీల నుంచి బీసీ అభ్యర్థులుగా పోటీ చేసినప్పటికీ గెలిచే అవకాశం లభించలేదు. ఓజో ఫౌండేషన్ పేరుతో గత మూడు సంవత్సరాలుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చిట్టి వచ్చి రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు కాంగ్రెస్ పార్టీని సరైన వేదికని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించే అవకాశం ఉందని ప్రజాభిమానాన్ని చురగొన్న నాలాంటి వారికి తప్పకుండా అవకాశం లభిస్తుందన్న విశ్వాసం ఉందని , కాంగ్రెస్ పార్టీ హుజూర్నగర్ అభ్యర్థి కోసం దరఖాస్తు చేసుకున్న పిల్లుట్ల రఘు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించకుంటే కచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇప్పటికే సందేశం ఇచ్చారు.
మరో అభ్యర్థి నేరేడుచర్లకు చెందిన తంగేళ్లపల్లి విద్యాసాగర్ ఒక ఎన్నారైగా బీసీ సామాజిక వర్గానికి చెంది తన దృష్టికి వచ్చిన సామాజిక సమస్యలపై తన వంతు ఆర్థిక సహకారం అందిస్తూ హుజూర్నగర్ నియోజకవర్గం చేసేందుకు ఒక బీసీ బిడ్డగా హుజూర్నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా తనకున్న పరిచయాలు సంబంధాలతో అవకాశం వస్తుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పలు పేపర్లలో వాల్ పోస్టర్లలో ప్రచారం చేసుకుని రాజకీయారంగేట్రం చేస్తున్నట్లు ఈనెల 23న ర్యాలీ నిర్వహించారు.
రాజకీయ ఉద్దండుడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న నలమాద ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా కచ్చితంగా నేనే అభ్యర్థిగా పోటీ చేస్తున్న 50వేల మెజారిటీతో గెలుస్తున్న అని ఇప్పటికే కార్యకర్తలకు పలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించి మరి స్పష్టమైన సంకేతాలు అందించినప్పటికీ ఆశావాహుల్లో మాత్రం దాదాపుగా మాకే టికెట్ వస్తుందన్న సంకేతాలను వారి అనుచరులకు చెబుతూ వస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తుది జాబితా వెళ్లడయ్యేంతవరకు ఆశావాహుల్లో ఎవరికి వారే నాదే టికెట్ అనుకున్నప్పటికీ ఉత్తంని కాదని ఇతరులకు అవకాశం రావడం కష్టమే. ఒకవేళ ఉత్తం పోటీ చేయకుండా ఎంపీగా అభ్యర్థిగా వెళితే తప్ప ఇతరులకు చాన్స్ దొరికే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments