Wednesday, May 14, 2025
HomeTelanganaఎవరి నిర్ణయం కరెక్టో

ఎవరి నిర్ణయం కరెక్టో

ఇది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమా

లేక.. అధికారుల నిర్లక్ష్యపు సూచనలా ?

ఎన్నో సంవత్సరాలుగా నాకు ప్రభుత్వ నిర్ణయాలు అధికారుల సూచనలు సలహాలతో జరిగే ఇలాంటి చర్యలను చూసినప్పుడు ఇంత అనాలోచిత నిర్ణయాలు ఎందుకు జరుగుతాయి అనేది చాలాసార్లు నాకు నేను ప్రశ్నించుకున్న ప్రశ్న.
టిటిసి, బీఈడీలు చేసి నిరుద్యోగులుగా సంవత్సరాల తరబడి ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూసి టెట్ లాంటి పరీక్షలకు అర్హత పొందాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు టెట్ పరీక్షలు రాస్తూ వస్తున్న నిరుద్యోగులు ఆర్థికంగా ఉన్నవారు వేరే పనులకు వెళితే మంచి ఉద్యోగం దొరకని వారు ప్రైవేటుగా పాఠశాలల్లో ,కళాశాలలో అధ్యాపకులుగా చేరి ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో జూలై నెల నుంచి మార్చి వరకు పాఠశాలలు, కళాశాలలు ఉంటాయని తెలిసిన వారు విద్యార్థులకు విధిగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సమయం అదే అని తెలిసినప్పటికీ ఏ ప్రభుత్వమైనా, అధికారులైన ఏ ఆలోచనలు లేకుండా సమయపాలన పాటించకుండా , వారు చేసే ఉద్యోగాన్ని సక్రమంగా చేయనీయకుండా నిరుద్యోగులుగా ఉండలేక ప్రైవేటు విద్యాసంస్థలు పెట్టి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న యాజమాన్యాలకు, అందులో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బంది కలిగేలా ఇలా టెట్ పరీక్ష డేట్లు ప్రకటించటమో , లేక ఉపాధ్యాయ ఉద్యోగ కొలువుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మార్చి నుండి జూన్ వరకు వారికి ఖాళీ సమయం ఉంటుందని తెలిసిన ఎందుకని మధ్యంతర సమయంలో విద్యార్థులకు, పాఠశాలకు ఇబ్బంది కలిగేలా ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నారో అర్థం కాని ప్రశ్న.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments