Sunday, May 18, 2025
HomeTelanganaఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలి సిపిఎం పార్టీ ధర్నా, తహసీల్దార్ కు వినతి

ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలి సిపిఎం పార్టీ ధర్నా, తహసీల్దార్ కు వినతి

నేరేడుచర్ల కేకేం మీడియా ఆగస్టు 29

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్ధానమైన రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ వర్తింప చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పారేపల్లి శేఖర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం నేరేడుచర్ల తాశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ,తాశీల్దార్ సైదులు కు మెమోరాండం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి డిసెంబర్ 2023 వరకు రుణాలు తీసుకున్న రైతులందరికీ,బ్యాంకుల్లో సమస్యలు ఉండి రుణమాఫీ కానీ రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొదమగుండ్ల నగేష్, పార్టీ మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, కుంకు తిరుపతయ్య, నీలా రామ్మూర్తి,మచ్చ సోమయ్య, అలవాల శ్రీధర్, ఎడ్ల సైదులు, మిర్యాల అంజి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments