Sunday, May 18, 2025
HomeTelanganaఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రారంభం

ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రారంభం

నల్గొండ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల గ్రామ శివారులో ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. అలాగే, ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments