*ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్*
పదేళ్లు దాటిన ఆధార్ కార్డు యూజర్లు మై ఆధార్ పోర్టల్ ద్వారా తమ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు డిసెంబరు 14తో ముగియనుంది. లేదంటే గడువు తర్వాత ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇదే చివరి గడువు అని తెలుస్తోంది.