Monday, January 13, 2025
HomeDevotionalఅఖండ హనుమాన్ చాలీసా పారాయణం

అఖండ హనుమాన్ చాలీసా పారాయణం

తిరుమల కేకే మీడియా మార్చ్ 18
తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థాన మండపంలో శనివారం జరిగిన 24 గం.ల అఖండ హనుమాన్ చాలీసా పారాయణం భక్తిభావాన్ని పంచింది. శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఈ పారాయణం ఆదివారం ఉదయం వరకు 24 గంటల పాటు జరుగనుంది. టిటిడి బోర్డు మాజీ సభ్యులు, యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ శివ కుమార్ ఆధ్వర్యంలో సోలీస్ ఐ కేర్ హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ ఎన్ రాము సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ శివ కుమార్, విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ రాఘవులు, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, ఉప్పల్ శాసన సభ్యులు శ్రీ బేతి సుభాష్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ, సోలీస్ ఐ కేర్ హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ ఎన్ రాము, శ్రీ రాజగోపాల్ నాయుడు, శ్రీ ఫణి భజన బృందం పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది భక్తులు ఈ పారాయణంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments