భారతదేశ కీర్తి కిరీటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ …. ఎమ్మెల్యే బత్తుల
మిర్యాలగూడ
భారతదేశ కీర్తి కిరీటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.
శుక్రవారం అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో దళిత సంఘాల, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తి కాడని భారతీయ శక్తి అని
బడుగు బలహీనర్గాల ఆరాధ్య దైవం గా కొలిచే అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గా చరిత్రలో నిలిచిపోయారని.
న్యాయ శాస్త్రం తో పాటు రాజనీతి శాస్త్రంలో అగ్రజుడని బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు. దేశ భవితలో ఆయన సూచనలు మార్గదర్శకాలు గా కొనసాగుతున్నాయని ,ఆయన చూపిన మార్గం భారత దేశ అభ్యున్నతికి కారణమని కొనియాడారు.
అనంతరం డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ , కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు కాలినడక వెళ్లి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు…
కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు , దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు