Sunday, May 18, 2025
HomeTelanganaఅంతా తూచ్... నేను పార్టీ మారట్లేదు... ప్రచారం చేసే వారిపై న్యాయపరమైన పోరాటం చేస్తా ఎంపీ...

అంతా తూచ్… నేను పార్టీ మారట్లేదు… ప్రచారం చేసే వారిపై న్యాయపరమైన పోరాటం చేస్తా ఎంపీ ఉత్తమ్

హైదరాబాద్ కే కే మీడియా జూన్ 23
నాపై కావాలనే కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీని వీడు తనని టిఆర్ఎస్లోకి చేరుతున్నట్లుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న కొందరి పట్ల సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అంతా నా ఇమేజ్ ని దెబ్బతీసేందుకు అని వారిపై న్యాయపరమైన పోరాటం చేస్తానని హెచ్చరించారు.
నేను కాంగ్రెస్ పార్టీకి విధేయుడునని రాష్ట్రంలో దేశంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని గత కొన్ని నెలలుగా నాపై రకరకాల ఆరోపణలు చేస్తూ నా రాజకీయ ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం పనికట్టుకుని చేస్తున్నారని అలాంటి వదంతులు కార్యకర్తలు నమ్మవద్దని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం సమిష్టి నాయకత్వంతో ముందుకు నడుస్తున్న ఈ తరుణంలో ఇలాంటి ప్రచారాలు నన్ను వ్యక్తిగతంగా మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న దుర్బుద్ధితో చేసే ప్రయత్నాలు తప్ప అందులో ఎంత మాత్రం నిజం లేదని అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తును ఇచ్చిందని అదే పార్టీలో కొనసాగుతానని తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments